UPDATES  

 ఐటీసీ కార్మికుడు హఠాత్మరణం – కర్మాగారం ఎదుట ఆందోళన

ఐటీసీ కార్మికుడు హఠాత్మరణం
– కర్మాగారం ఎదుట ఆందోళన
– శాంతిభద్రతలు పర్యవేక్షించిన పోలీసులు
– మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి

మన్యం న్యూస్, సారపాక , జనవరి 21
ఐటిసి కార్మికుడు డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో హఠాత్మరణం చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం సారపాక పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… బూర్గంపాడు మండలానికి కేసుపాక వెంకటేశ్వర్లు (48) అనే వ్యక్తి సారపాక ఐటిసి పేపర్ బోర్డ్ కర్మాగారంలో క్యాజువల్ వర్కర్ గా పనిచేస్తున్నారు. కాగా శుక్రవారం ఉదయం ఎప్పటిలాగానే డ్యూటీ కి వెళ్ళిన కేసుపాక వెంకటేశ్వర్లు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. కాగా ఉదయం డ్యూటీ కి వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి మృతి చెందినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కర్మాగారం ఎదుట ఆందోళన

ఐటిసి కర్మాగారంలో క్యాజువల్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి డ్యూటీ ముగించుకుని వస్తున్న సమయంలో చనిపోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ ఐటీసీ గేటు ముందు బైఠాయించారు. ఐటిసి పి ఎస్ పి డి రూల్స్ ప్రకారం కేశపాక వెంకటేశ్వర్లు అనే కార్మికుడు ఇన్ టైంలో చనిపోయినట్లుగా గుర్తించాలని, ఎల్ టి ఏ ద్వారా మృతుడి కుటుంబానికి చెందవలసిన సదుపాయాలను కల్పించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐటిసి కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్, కొందరు సర్ది చెప్పి ఆందోళన విరమింప చేశారు.

– శాంతి భద్రతలను పర్యవేక్షించిన పోలీస్ శాఖ

ఐటీసీ కార్మికుడు మృతి చెందడంతో అతడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ తో కుటుంబ సభ్యులు ఐటిసి గేటు ముందు బైఠాయించేందుకు వెళ్తున్నట్లు విషయం తెలుసుకున్న బూర్గంపాడు ఎస్ఐ సంతోష్ హుటాహుటిన అక్కడికి చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. మృతుడు బంధువులతో మాట్లాడుతూ… ఏ విషయం అయినా ధోరణిలో పరిష్కరించుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. పాల్వంచ సీఐ రామకృష్ణ, ఎస్ఐ ప్రవీణ్, ఎస్సై శ్రీను, భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ బి.వి.ఎన్.రావు తదితర పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రి సుమారు మూడు గంటల వరకు పర్యవేక్షించారు.
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి
ఐ టి సి కార్మికుడు కేసుపాక వెంకటేశ్వర్లు మృతి చెందడంతో శోకసంద్రలో మునిగిపోయిన మొదటి కుటుంబాన్ని జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత శనివారం పరామర్శించారు. కేసుపాక వెంకటేశ్వర్లు మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !