మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 21: పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, రేగా కాంతారావు ఆదేశాల మేరకు బూర్గంపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలో గల కేసుపాక వెంకటేశ్వర్లు గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకొని శనివారం వారి ఇంటికి వెళ్లి జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత నివాళులర్పించి , కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పార అంతేకాకుండా, రూ 5000 ఆర్థిక సహాయం అందించారు., ఆమెతో పాటు మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహరావు , బూర్గంపహాడ్ మండల ఎస్సీ సేల్ అధ్యక్షులు సాలయ్య, బి ఎస్ ఆర్ పార్టీ నాయకులు ఇసంపల్లి వెంకటేశ్వర్లు, తదితర పార్టీ నాయకులు, గ్రామపెద్దలు, యువకులు, మహిళలు నివాళులు అర్పించారు.
