మన్యం న్యూస్ మణుగూరు టౌన్, జనవరి 21
సింగరేణి ఎస్టి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2023 క్యాలెండర్ ను ఏరియా జిఎం జి.వెంకటేశ్వర్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సింగరేణి యాజమాన్యం గిరిజనుల సంక్షేమం కోసం 665 బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసి చరిత్ర సృష్టించిందని,అలాగే ఉద్యోగుల బాగోగులు చూసేందుకు వారి సమస్యలు పరిష్కరించేందుకు ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యానికి ఒక వారధిగా ఉండే విధంగా ప్రతి ఏరియాలో లైజన్ ఆఫీసర్లను కూడా నియమించిందని ఆయన గుర్తు చేశారు.అదేవిధంగా ఎస్టి ఎంప్లాయిస్ కూడా సింగరేణి సంస్థ పట్ల అంకితభావంతో పనిచేయాలని,కష్టాల్లో ఉన్న తోటి వారిని ఆదుకునేందుకు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా తమ వంతు గుర్తింపు పొందాలని ఆయన కోరారు.సింగరేణి సంస్థ పురోగతితో సంస్థలో పనిచేస్తున్న అన్ని తరగతుల ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా జీవించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం డి.లలిత్ కుమార్,ఏరియా అధికార ప్రతినిధి,ఎస్ రమేష్, ఎస్టి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏరియా అధ్యక్షులు ధనసిరి వెంకటేశ్వర్లు,ఏజీఎం సివిల్ అధ్యక్షులు మాలోతు రాముడు పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్, ఏరియా లైజన్ ఆఫీసర్ ఇస్లావత్ సతీష్ కుమార్,ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకటేశ్వర్లు, కార్య నిర్వాహక అధ్యక్షులు బి జగన్ నాయక్,ఉపాధ్యక్షులు తుకారాం,కేంద్ర కమిటీ నాయకులు భూక్య రాందాస్, సీనియర్ అండర్ మేనేజర్, ఏరియా ప్రధాన కార్యదర్శి డి శంకర్,వి కృష్ణయ్య,సభ్యులు శ్రీహరి నాయక్,జి దశరథ్, కుమారి,శ్రావణి తదితరులు పాల్గొన్నారు
