మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 21.. లైంగిక వ్యాధులు పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్ఐవి వైరస్ కు గురైన యువతను దూరంగా ఉంచకుండా ఆదరించి అవగాహనతో హెచ్ఐవి వైరస్ ను నియంత్రించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శిరీష తెలిపారు. శనివారం నెహ్రు యువ కేంద్ర ఖమ్మం యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాత కొత్తగూడెంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలోని సెమినార్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి సహకారంతో లైంగిక వ్యాధులపై శిక్షకులకు శిక్షణ కార్యక్రమం (టీఓటి) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా యువజన అధికారి అన్వేష్ చింతల అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లైంగిక వ్యాధుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, హెచ్ఐవి వైరస్ కు గురైన వారిని దూరం పెట్టకుండా వారిని ఆదరించాలని, అవగాహనతోనే హెచ్ఐవి వైరస్ ను నియంత్రించవచ్చని, శారీరక పరిశుభ్రత ఎంతో అవసరమని, అన్నారు. సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యత యువతపై ఉందని పిలుపునిచ్చారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి లెనినా మాట్లాడుతూ బాలికలు ప్రలోభాలకు లొంగిపోకుండా, అప్రమత్తం గా ఉండాలని, చైతన్యవంతులు కావాలని కోరారు. బాలల సంక్షేమ సమితి సభ్యులు కే అంబేద్కర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతపై ఉందని యువత, ఆశ్లీలత వైపు తలోగ్గ కుండా దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రిసోర్స్ పర్సన్ గా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ సత్యకుమార్ లైంగిక వ్యాధుల పట్ల యువతకు అవగాహన కల్పించారు. టీబి కంట్రోల్ జిల్లా కోఆర్డినేటర్ సోమయ్య టీబి ఎలా వస్తుంది దాని నివారించడానికి ఏమి చేయాలి అనే అంశం మీద ప్రొజెక్టర్ పైన వివరించారు. కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ ఆకులపల్లి మధు, జిల్లాల బాలల సంరక్షణ అధికారిని, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్, నెహ్రు యువ కేంద్ర వాలెంటర్లు నరేష్ , వివిధ మండలాల నుండి విచ్చేసిన యువతి యువకులు , చైల్డ్ లైన్ బాలల సంరక్షణ విభాగ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
