UPDATES  

 బీఆర్ఎస్ వల్లే అభివృద్ధి సాధ్యం…. – మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహ రావు.

మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 22: బీఆర్ఎస్ పార్టీ వలనే అభివృద్ధి సాధ్యమవుతుందని మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహ రావు అన్నారు. ఆదివారం మణుగూరు మండలం పగిడేరు గ్రామపంచాయతీలో ఇద్దరు వార్డు మెంబర్లతో పాటు వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాల వారు పార్టీలో చేరినారు. పార్టీలో చేరిన అందరికీ ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి కేవలం పినపాక నియోజకవర్గం లోనే ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసి చూపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, మణుగూరు టౌన్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి నవీన్, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు మట్టపల్లి సాగర్యాదవ్, మండల రైతు సంఘం అధ్యక్షులు గువ్వా రాంబాబు, పిఏసిఎస్ డైరెక్టర్ పప్పుల ప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు కుంజా రంగన్న, వరదయ్య, ఉప సర్పంచ్ దామల్ల దయాకర్, గార బుచ్చి రాములు, గంగారపు రమేష్, బూర్గుల సంజీవరావు, బూర్గుల సతీష్, వేర్పుల సురేష్, బేతమల్ల సుందర్, కుంజ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !