మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 22: మండలానికి చెందిన రాపర్తి అనూషా అనే నిరుపేద విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. ఆ విద్యార్థినికి శ్రీ విద్య విద్యాసంస్థల చైర్మన్ నూకారపు రమేష్ నాలుగు వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ నగదును ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పొషం నరసింహారావు, పిఏసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, నాయకులు అక్కిరెడ్డి సంజీవరెడ్డి, కుడితిపూడి కోటేశ్వరరావు, బర్ల సురేష్, సాధం రమణ, హరి గోపాల్, జక్కం రంజిత్, సురేందర్ పటేల్, సాయి చరణ్, తదితరులు పాల్గొన్నారు.
