రిపోర్టర్ రామారావుకి మాతృవియోగం
తిరుపతమ్మ భౌతిక కాయన్ని సందర్శించి నివాళులర్పించిన ఎమ్మెల్యే మెచ్చా
మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 22.. అశ్వరావుపేట పట్టణంలో ఈనాడు రిపోర్టర్ రామారావు మాతృమూర్తి తిరుపతమ్మ (85) స్వర్గస్తులు అవ్వడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఆదివారం ఆమె భౌతిక కాయన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండి పుల్లారావు, మోహన్ రెడ్డి, టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంపూర్ణ, ఉష్ ప్రకాష్, రవి, నార్లపాటి రాములు, చిప్పనపల్లి శ్రీను, బాణాల శ్రీను తదితర నాయకులు కార్యకర్తలు ఉన్నారు.