కమ్యూనిస్టులు అంటే పోరాట జీవితం……
• కార్పోరేట్ సంస్థలకు భూములను అప్పగిస్తున్న కేంద్రం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్…
మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి23: కమ్యూనిస్టులు అంటేనే పోరాటాల జీవితమని, సమాజం కోసం జీవించేది ఒక్క కమ్యూనిస్టుల మాత్రమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ స్పష్టం చేశాడు. సోమవారం సిపిఎం సీనియర్ నాయకులు వంకాయలపాటి శ్రీనివాసరావు స్థూపాన్ని ఆయన ప్రారంభించాడు. పార్టీ జెండాను సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య ఆవిష్కరించాడు. అనంతరం జరిగిన వంకాయలపాటి సంస్కరణ సభలో సుదర్శన్ మాట్లాడుతూ…. భూపోరాటాలు, ప్రజా పోరాటాలు చేసిన శ్రీనివాసరావు ఈ ప్రాంత బిడ్డగా మంచి గుర్తింపును పొందాడన్నారు. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం ప్రజలను మతాల పేరిటి విభజిస్తోందని విమర్సించాడు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను రాకుండా అడ్డుకుంటూ గవర్నర్లచేత పెత్తనం చేస్తుందన్నారు. రాష్ట్రాలపై పరోక్ష పాలన చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి చూస్తున్నాడని ఆరోపించాడు.ఈ కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, భద్రాద్రికొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, అఖిలపక్షం నాయకులు తాళ్లూరి వెంకటేశ్వరరావు, దారా బాబు, మాలోత్ బోజ్యనాయక్, గార్లపాటి రామనాధం, కొణకండ్ల వెంకటరెడ్డి, నాగసీతరాములు,గాదె లింగయ్య, భూపతి శ్రీనివాసరావు, అన్నవరపు సత్యనారాయణ,కొండపల్లి శ్రీధర్, యాసా నరేష్, ఐలూరి రాంరెడ్డి, లగడపాటి రమేష్, భూపతి రమేష్ , పెద్దిని వేణు, తదితరులు పాల్గొన్నారు.