UPDATES  

 ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన సదస్సు..

మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 23: మణుగూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని శివలింగాపురం బాలల సదనంలో అంతర్జాతీయ బాలల వారోత్సవాల సందర్భంగా సోమవారం సిడిపిఓ జయలక్ష్మి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి ప్రవర్తన వ్యత్యాసాన్ని గుర్తించి అక్కడి నుంచి తప్పించుకోవాలన్నారు. చైల్డ్ లైన్, చైల్డ్ మ్యారేజ్, వ్యక్తిగత పరిశుభ్రత, అక్రమ రవాణా, పోషకాహారం పై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులకు చెప్పి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ను వారికి సమాచారం అందజేసి సహాయ సహకారాలతో సమస్యలను చట్ట ప్రకారం పరిష్కారం చేసుకోవాలన్నారు. ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొన్నప్పుడు అది తప్పుగా భావించకుండా సమస్యను గుర్తించి పరిష్కారం దిశగా బాలిక కు తల్లిదండ్రులు, స్నేహితులు సహకరించాలని ఆమె కోరారు. ఆడపిల్లలు సమాజానికి మణిహారం, ఆడపిల్లలకు రక్షణ కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ దీప్తిరాణి, అంగన్వాడీ టీచర్లు సుమలత, రాణి, సుజాత హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !