పైసలన్నీ…. మట్టి పాలు!
ములకాపాడు క్రీడా మైదానం రూ. 10 లక్షలుతో ఏర్పాటు..
10 గ్రామపంచాయతీలు 15 నుండి 20 వేల రూపాయలు వరకు వసూలు
నేడు వృధాగా క్రీడామైదానం పట్టింపులేని అధికారులు..
అది ప్రైవేట్ క్రీడా మైదానం అని అంటున్న ఎంపీడీవో..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
ఒకపక్క గ్రామ పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంటే ఉన్న పైసలను వృధాగా ఖర్చు చేస్తూ ఎవరికి ఉపయోగపడకుండా వృధా చెందుతున్న వైనం మండలంలోని ములకపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని అప్పటి సీఐ వెంకటేశ్వర్లు గుర్తించి క్రీడా ప్రాంగణం కోసం అధికారులకు చెప్పి అందరి సమన్వయంతో క్రీడామైదానం ఏర్పాటుకు ప్రణాళికను సిద్ధం చేశారు. అది నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మండల అధికారులను ఒప్పించి ఐటిడిఏ పిఓ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడాకారుల కొరకు ఎంతో ఖర్చుపెట్టి సుమారు 10 లక్షల వ్యయంతో క్రీడామైదానని తనే స్వయంగా పర్యవేక్షిస్తూ ఏర్పాటుకు ప్రణాళికను రచించారు ఈ క్రీడా మైదానానికి ఖర్చు అధికం కావడంతో మండలంలోని దాతల సహాయం తీసుకున్నారు మండలంలోని కాంట్రాక్టర్లు, ఫైనాన్సర్లు, వ్యాపారస్తులను ఆర్థిక సహాయం తీసుకున్నారు అనంతరం ఈ పిహెచ్ఈ పరిధిలోని ప్రతి గ్రామపంచాయతీ సర్పంచులను సమావేశం నిర్వహించి ఈ క్రీడా మైదానం ఏర్పాటు సహాయం చేయాలని కోరారు వారు కూడా క్రీడామైదానం ఏర్పాటు అయితే పంచాయతీలోని క్రీడాకారులకు ఉపయోగకరంగా ఉంటుందని ఒప్పుకున్నారు అలా అందరి సహకారంతో క్రీడా మైదానం ఏర్పాటు చేసుకుని ఐటీడీఏ పీవో గౌతమ్, ఏ ఎస్ పి వినీత్ ఆధ్వర్యంలో ప్రారంభించారు కొన్ని నెలల తర్వాత క్రీడ మైదానం ఏర్పాటు చేసిన ప్రాంతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వస్తుందని డీఎంహెచ్వో ఆదేశాలతో క్రీడామైదానికి అనుమతిని నిరాకరించారు ఎంతో ఖర్చు వ్యయంతో నిర్మించిన క్రీడామైదానాన్ని నిర్మాణ వ్యయంలో ఉన్నప్పుడే అనుమతి ఇవ్వకుండా ఉంటే ఖర్చుపెట్టిన లక్షల రూపాయలు మిగిలి ఉండేవని వృధాగా పోవని మండల వాసులు అంటున్నారు. ఒకపక్క గ్రామ పంచాయతీలకు నిధులు లేక తలఢిల్లీపోతుంటే ఎంతో సర్దుబాటు చేసి ఒక్కొక్క గ్రామ పంచాయతీ నుంచి 20 నుంచి 25 వేల రూపాయల సర్దుబాటు చేస్తే వృధాగా పోయాయి అదే పైసలను గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం వాడుకుంటే బాగుందని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు.
అది ఒక ప్రైవేట్ క్రీడా మైదానం.. ఎంపీడీవో చంద్రమౌళి..
అది ఒక ప్రైవేట్ క్రీడ మైదానమని పోలీస్ వారు డాక్టర్ కలిసి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశారని దానికి సర్పంచులు తలో కొంత సహాయం చేశారని దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని గ్రామపంచాయతీ సర్పంచులు వారి స్వతగా ఇచ్చారని తెలిపారు..
మా పైసలు ఇలా వృధా అవుతాయి అనుకోలేదు.. సర్పంచ్ జుంజురి లక్ష్మి..
క్రీడా మైదానం ఏర్పాటయితే పంచాయతీలోని క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడుతుందని అనుకోని ఏర్పాటుకు ఒప్పుకున్నామని ఇలా పైసలు వృధా అవుతాయని అనుకోలేదని తెలిపారు. ప్రగలపల్లి పంచాయతీ నుంచి 25 వేల రూపాయల వరకు క్రీడామైదానికి ఇచ్చానని గ్రామపంచాయతీ అభివృద్ధికి వారు ఉంటే బాగుండేదని ఆవేదన చెందారు.