మన్యం న్యూస్ గుండాల: కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ,గుండాల మండల ఇంచార్జ్ కోలేటి భవాని శంకర్ అన్నారు. ఆయన సోమవారం ఎమ్మెల్యే రేగా ఆదేశాల మేరకు సోమవారంబి.ఆర్.ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నారం రెడ్డి రవీందర్ రెడ్డికి ప్రమాదవశాత్తు కాలు విరగడంతో అతని స్వగ్రామానికి వెళ్లి పరామర్శించారు. నారాయణరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు . ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సైతం ప్రతి కార్యకర్తకు వెన్నంటి ఉండి ఆపదలో అండగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. అన్ని విధాలుగా ఆదుకునే మహా నాయకుడు ఎమ్మెల్యే రేగా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, బీసీ మండల ప్రెసిడెంట్ గడ్డం రమేష్ , ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, నరేష్ తదితరులు పాల్గొన్నారు
