కోల్డ్ వార్ నుండి డైరెక్ట్ వార్ ఇల్లందు కేంద్రంగా ఆత్మీయ సమ్మేళన రాజకీయాలు.
*ఇక ప్రత్యక్ష యుద్ధమే
* ఒక్క నా కార్యకర్తకు హాని తలపెట్టిన అక్కడే భైఠాఇస్తా
* లలితాపురంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం
* యుద్ధానికి సిద్ధంగా ఉండండి: జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
మన్యం న్యూస్ ఇల్లందు జనవరి23:- ఇల్లందు కేంద్రంగా తాజా మాజీ ఎమ్మెల్యే ల మధ్య ఇన్ని రోజులు కోల్డ్ వార్ నడిచింది. సోమవారం నాటి ఆత్మీయ సమ్మేళనాల తో ప్రచ్యన్న యుద్ధం కు ఫుల్ స్టాప్ పడి, ప్రత్యక్ష యుద్ధం స్టార్ట్ అయింది.మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య తాజా ఎమ్మెల్యే హరిప్రియ ఒకరినొకరు విమర్శించుకోవటం హాట్ టాపిక్ గా మారింది.లలితాపురం మామిడితోట లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం కోరం కనకయ్య అధ్వర్యంలో సోమవారం రోజు ఆత్మీయ సమ్మేళనం జరిగింది.పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచర ఘనం అంచనాలను తగినట్లు భారీగానే హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా తనను తన అనుచరులను పోలీసులు, ప్రజాప్రతినిధులు ,రెవిన్యూ అధికారులు చాలా ఇబ్బందులకు గురి చేసినా ఉపెక్షించాం ఇక ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పాడు. కేటీఆర్ తో తనకున్న సత్సంబందం వల్ల ఇంతకాలం పార్టీలో కొనసాగానని చెప్పారు. తనతో పాటు తన అనుచరులంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు చెప్పారు. ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన అత్మీయులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం మాట్లాడుతూ గతంలో ఒక మారు ఎమ్మెల్యే గా ఇప్పుడు జెడ్పీ చైర్మన్ గా పనిచేస్తూఉన్నా అస్తులేవి సంపాదించలేదని అస్థుల కన్నా ప్రజల ఆదరాభిమానాలు ఉంటే చలాని చెప్పుకొచ్చారు.ఇల్లందు కు గతంలో పనిచేసిన ఎమ్మెల్యే లకు ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరుకు చాలా తేడా ఉందన్నారు.ఇక పైన యుద్దానికి సిద్దం గా ఉండాలని కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
