UPDATES  

 టూరిస్టులతో ఒరిగేది ఏమీ లేదు *పొంగులేటి,కోరం ల పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే హరిప్రియ

టూరిస్టులతో ఒరిగేది ఏమీ లేదు
*పొంగులేటి,కోరం ల పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే హరిప్రియ
మన్యం న్యూస్,ఇల్లందు:
పొంగులేటి,కోరం ల పై ఎమ్మెల్యే హరిప్రియ ఘాటు కామెంట్స్ చేశారు.ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
సోమవారం నాటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా హరిప్రియ మీడియా తో మాట్లాడుతూ ఒక ఎస్టీ రిజర్వుడ్ నియోజక వర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పనేంటని ఏ స్వార్థంతో ఏం ఆశించి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని కార్యకర్తల మధ్య విభజన వాతావరణం తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. ఓడిపోయి ఇంటివద్ద కాలిగా ఉన్న కోరం కనకయ్య ను సీఎం కేసీఆర్ గుర్తించి క్యాబినేట్ హోదా అయినటువంటి జెడ్పీ చైర్మన్ పదవిలో కూర్చుండ బెట్టి సముచిత స్థానం కల్పించినప్పటికి పార్టీకి ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు.కోరం అనుభవిస్తున్న పదవి, హొదా, కారు సీఎం కెసిఆర్ పెట్టిన బిక్ష అని, అదంతా మరిచి నేడు కన్నతల్లి లాంటి పార్టీకి నమ్మక ద్రోహం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎన్ని కుట్రలు పన్నిన ప్రజలు బీఆరెస్ వెంటే ఉంటారు అని అన్నారు.ఈ సమావేశంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు,బీఆర్ ఎస్ నాయకురాలు కటకం పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !