పొంగులేటి, కోరం లపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదు.
మన్యం న్యూస్ ఇల్లందు జనవరి24:- ఇల్లందులోని జెడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మంగళ వారంరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోరం కనకయ్య లపై ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, టీజీబీకేఎస్ నాయకుడు చేసిన ఆరోపణలను పొంగులేటి ,కోరం అనుచరులు తీవ్రంగా కండించారు.వారు మాట్లాడుతూ
కోరం కనకయ్య ఎమ్మెల్యే గా గెలుపొంది నియోజక అభివృద్ధి కోసమే తెరాసా తీర్థం పుచ్చుకున్నారని
2014 ఎన్నికల సమయానికి నియోజక వర్గంలో అట్టడుగున ఉన్న తెరాసా ఓటు బ్యాంకును 2018 ఎన్నికల నాటికి 60వేల పైచిలుకు బలమైన ఓటు బ్యాంకుగా మలిచిన ఘనత కోరం కనకయ్యకే దక్కిందన్నారు.
జెడ్పీ నిధులతో జిల్లాలోని వివిధ మారుమూల ప్రాంతాలతో పాటుగా ఇల్లందు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండటంతో ఓపక్క నియోజకవర్గ ప్రజలు కనకయ్య కి బ్రమ్మరధం పడుతుండటం,మరోపక్క ఉమ్మడి జిల్లాతో పాటుగా ఇల్లందు నియోజకవర్గానికి చెందిన అనేక బీద, బాధిత కుటుంబాలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయాలతో పాటుగా,కుల మతాలకతీతంగా చర్చీ,దేవాలయాలు,ఈద్గా లాంటి ప్రార్థనా మందిరాల నిర్మాణాలకు సహాయ