UPDATES  

 మండల సర్వసభ్య సమావేశం రసా బస మెమొలు తీసుకున్న తీరుమారని అధికారులు కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు

మండల సర్వసభ్య సమావేశం రసా బస

మెమొలు తీసుకున్న తీరుమారని అధికారులు

కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు

మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 24: మండల ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి అధికారులు మూడింట రెండో వంతు కూడా హాజరు కాలేదు.రెవిన్యూ డిపార్ట్మెంట్ నుండి తహసీల్దార్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి ఎంపీడీవో, ఎంపీటీసీలు ఎంపీపీ, హాజరైనారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి అధికారులు రాకపోవటం వలన ఖాళీగా కూర్చీలు దర్శనమిచ్చాయి, సమావేశానికి హాజరైన కొంతమంది అధికారులతో ఎంపీపీ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. రెవిన్యూ డిపార్ట్మెంట్ నుండి మండల తాహాసిల్దార్ తన శాఖ గురించి మాట్లాడుతూ త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య, వితంతు పింఛన్ల మంజూరి చేపడుతున్నట్లు తెలిపారు. తదనంతరం మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ పాషా మాట్లాడుతూ మట్టితోలకాలకు మైనింగ్ శాఖ ఇవ్వవలసిన పర్మిషన్ మీరు ఎలా ఇచ్చారు అని నిలదీశారు. అందుకు తాహాసిల్దార్ మేము ఎవరికీ మట్టితోలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని అన్నారు మండలంలో ఉన్నటువంటి 30 గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసినటువంటి పల్లె ప్రకృతి వనాలకు తోలినటువంటి గ్రావెల్ కు అనుమతులు ఏవిధంగా ఇచ్చారు అనీ అక్రమ మట్టితోలకాల దారులపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని తాహాసిల్దారుని నిలదీశారు. ఈ ప్రశ్నకు తాహాసిల్దార్ సమాధానం ఇస్తూ నూతన ఇళ్ళ నిర్మాణం చేపట్టుకునే వారికి బేస్మెంట్ వరకు మట్టి తోలుకునేందుకు గృహ వినియోగదారులు ఇబ్బందులు పడకూడదని ఉద్దేశంతో అనుమతులు ఇచ్చామని తెలియజేశారు. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పోడు భూముల సమస్య పై సంబంధిత అధికారిని నిలదీయగా సంబంధిత శాఖ అధికారి మాట్లాడుతూ 2005 కంటే ముందు పోడు వ్యవసాయం చేసు కుంటున్న వారందరికీ పోడు పట్టాలు ఇస్తామని అన్నారు. రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులమైన మేము చర్చించుకున్న తర్వాత మరికొన్ని పోడు పట్టాలు ఇస్తామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పేరాయి గూడెం గ్రామపంచాయతీ ప్రజలు స్మశాన వాటికకు వాడుకుంటున్నటువంటి కెమిలాయిడ్స్ పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్ భూమికి కందకాలు తవ్వడం వలన పేరాయి గూడెం గ్రామపంచాయతీలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలు దెబ్బ తినటం జరిగిందని కావున అట్టి ప్రభుత్వ భూమిని స్మశాన వాటికకు కేటాయించాలని సర్వసభ్య సమావేశంలో మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ పాష ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. జనవరి 4వ తారీఖున జరిగినటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు గల వెయిటింగ్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని ఐటిడిఏ ఏడి ప్రసాదును వైస్ ఎంపీపీ నిలదీయగా మేము ప్రజా ప్రతినిధులందరికీ ఫోన్ కాల్ చేసామని తెలిపారు దానిలో భాగంగా వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర లేచి నిలబడి నేను ఎంపీటీసీ 2 అని అశ్వారావుపేట మండల వైస్ ఎంపీపీని అని సర్వసభ్య సమావేశంలో పరిచయం చేసుకున్నారు, ఈ సందర్భంలో వైస్ ఎంపీపీ కొంత అసహనానికి గురి అయినారు. అధికారులను మండల కో ఆప్షన్ సభ్యులు పాష నిలదీసే క్రమంలో అందరి అధికారుల సమాధానం ఎంపీపీ ఏ చెప్పటం వలన కూడా సర్వసభ్య సమావేశం సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. మరో ప్రశ్నగా ఎంపీపీని కోఆప్షన్ సభ్యులు అడుగుతూ దళితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు ఎకరాల భూమి ఇస్తారు అని అన్నారు కదా ఆ విషయం ఏమైందని అడగగా అందుకు సమాధానంగా ఎంపీపీ ఆ మూడెకరాల భూమి నేను ఇవ్వాలా అని ఎదురు ప్రశ్న వేసినారు ఆ మాటకు సమావేశంలో ఉన్నటువంటి సభ్యులందరూ ఒక్కసారిగా ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. అనంతరం అశ్వారావుపేట మండలంలో పూర్తయిన పనుల వివరాలు అధికారులు తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులు త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు లీడర్లు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !