మినీ మేడారం సుంకు జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించాలి…
– భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలి.
– పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.
మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 24: ఈనెల 31 నుండి 4వ తేదీ వరకు తోగ్గూడెంలో జరిగే మినీ మేడారం సుంకు జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన మంగళవారం తోగ్గూడెం సమ్మక్క- సారలమ్మ ఆలయం వద్ద జాతర కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వనదేవతల ఆశీస్సులు పొందాలని, జాతరను విజయవంతం చేయాలన్నారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు, బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్, రామిరెడ్డి, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, జావిద్, ముద్దంగుల కృష్ణ, తాతారమణ, యూసఫ్ షరీఫ్, వెంకట్ రెడ్డి, రజిత, రమాదేవి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.