మన్యం న్యూస్, ఇల్లందు జనవరి24:- మాజీ మంత్రిపరిటాల రవి 18వ వర్ధంతి వేడుకలు ఇల్లందు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముద్రగడ వంశి అధ్వర్యంలో మంగళవారంఘనంగా జరిగింది.మొదట పరిటాల రవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముద్రగడ వంశి, చందావత్ రమేష్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పరిటాల చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఒక వ్యక్తి మరణించి 18 ఎల్లు గడిచినా మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన ఎంతలా ప్రజల మదిలో చోటు సంపాదించారు అనేది అర్థం చేసుకోవచ్చు అన్నారు. మరో మారు సిబిఎన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ గెలవాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్యామ్ తీవరి,అయ్యోరి నాగరాజు,ఉప్పనూతల రాజు ప్రసాద్ గౌడ్, చందా నర్సింహా,చెలిమల బాబు, నూక వెంకటేశ్వర్లు,మాటేలా రత్నాకర్,రసమల వెంకటేశ్వర్లు,కంది రవి, సింధు రవి, ముత్యాల రమేష్, సి. హెచ్ రవి, తదితరులు పాల్గొన్నారు