*ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను వసతిగృహలకు కేటాయించాలి.
*పి.డి.ఎస్.యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్
* కలెక్టర్ కి వినతి పత్రం అందజేత
మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
ప్రభుత్వ వసతి గృహాలకు సొంత భవనాలు కేటాయించి విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించేందుకు కలెక్టర్ చొరవ చూపాలని పిడిఎస్యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. పి.డి.ఎస్.యూ అధ్వర్యంలో కలెక్టర్ వి.పి.గౌతమ్ కిమంగళవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు….
ఖమ్మం నగరంలో బీసీ బాలుర వసతి గృహాలు అద్దె భవనాల్లో అరకోర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు అధికారులతో ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు. ఖమ్మం కలెక్టరేట్ కొత్తగా ఏర్పడిన సందర్భంగా నగరంలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టరేట్ ప్రాంగణంలోకి మార్చడం వల్ల ఖాళీ గా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ వసతి గృహాలకు కేటాయించడం వల్ల విద్యార్థుల ఇబ్బందులు తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. సరైన సౌకర్యాలు లేకవిద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను వసతి గృహాలకు కేటాయించడం వలన అద్దె భారం ప్రభుత్వంకు తప్పుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పి.డి. ఎస్.యూ జిల్లా సహాయ కార్యదర్శి దీపిక, డివిజన్ అధ్యక్షులు సతీష్, నాయకులు కరుణ్, రాంబాబు, సాయి లు పాల్గొన్నారు.