మన్యం న్యూస్, అశ్వాపురం:
మండలంలోని మల్లెలమడుగు గ్రామ పంచాయతీ లో నిర్మిస్తున్న శ్రీ రామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కొరకు మల్లెలమడుగు డైరీ ఫామ్ నిర్వాహకులు నున్న సత్యం డైరీ ఫామ్ సభ్యులు కళ్యాణ్ చేతుల మీదుగా రూ. 50,016/_ ఆలయ కమిటీ సభ్యులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోడి కృష్ణవేణి, ఉప సర్పంచ్ చావా వీరరాగావులు, ఆలయ కమిటీ చైర్మన్ మామిడి శ్రీనివాస్, బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్, గొడ్డుగొర్ల వెంకన్న ,వేల్పుల వెంకన్న, గొడుగు నాగేశ్వరరావు, సురకంటి వేణు తదితరులు పాల్గొన్నారు
