మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 24, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఐటీడీఏ ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహించిన గిరిజన సాంప్రదాయ జీవన విధానం, వాళ్ల స్థితిగతులపై మూడు రోజులపాటు జరిగిన ఫస్ట్ నేషనల్ వర్క్ షాప్ పోటీలో జూలూరుపాడు మండలం హరిజనవాడ గ్రామానికి చెందిన గార్లపాటి శంకర్ జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా, మండల కేంద్రంలోని సాయిబాబా మందిర ఆవరణంలో ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గార్లపాటి శంకర్ ను మంగళవారం గణ సన్మానం చేసి, స్వీట్లు తినిపించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షులు సవడం వెంకటేశ్వర్లు, అనుముల భద్రయ్య, మల్సూరు, పాలేపు సత్యనారాయణ, ఉదయ్ భాస్కర్, తంబర్ల పుల్లారావు, ఇడుపుల సాంబ, గోపాల్, బుడెన్, సాయి, ప్రవీణ్, రామాచారి, సతీష్ పాల్గొన్నారు.