మన్యం న్యూస్ అశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామంలోని బొడ్రాయి బజార్ లో సోమవారం రాత్రి 8 :30 తునికేసి లక్ష్మమ్మ (60) మెడలో నుంచి గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బంగారపు చైన్ లాక్కెళ్ళారు.ప్రత్యక్ష సాక్షులు,బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.తన స్వంత పని మీద బయటకు వచ్చిన లక్ష్మమ్మ పనులు ముగించుకొని నడుచుకుంటూ ఇంటికి వెళుతుండగా బైక్ పై వచ్చిన దుండగులు లక్ష్మమ్మవెనుక నుండి వెళ్లి మెడ నుండిబంగారపు చైన్ లాక్కెళ్ళారు. వెంటనే మొండికుంట చేరుకున్న పోలీసులు గ్రామంలోని సీసీ కెమెరాల లను పరిశీలిస్తున్నారు.
మొండికుంటలో ఆదివారం రాత్రి ఇంటి ముందు పెట్టిన బైక్ ని దొంగలించిన దొంగలు అ సంఘటన మరవక ముందె ఈ దొంగతనం అది జనసంచారం ఉన్న సమయంలో పాల్పడి పోలీస్ లకే సవాలు విసురినట్టు అయింది. ఎస్ ఐ నాగులు మీరా బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. వరుస దొంగతనాలతో మొండికుంట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
