మన్యం న్యూస్,అశ్వాపురం: శ్రీ భావని లింగమంతుల స్వామి
జాతర షాపులకి సంబంధించి ఈ నెల 25న తేదీన బుధవారం ఉదయం 9గంటలకు అశ్వాపురం రామాలయం గుడి దగ్గర షాపులు వేలంపాట నిర్వహించబడునని జాతర నిర్వహణ కమిటీ అధ్యక్షుడు లంకెల రమేష్ యాదవ్ తెలిపారు. షాపులు, వాటి వివరాలు, కొబ్బరికాయల షాపులు, తలనీలాలు షాపులు కోళ్లపారలు, మేకపోతుల గొర్రెపోతుల కటింగ్ షాపు, వైన్ షాపులు పాట తదితర షాపుల వేలం జరుగుతుంది కావున వేలం పాట పడేందుకు ఆసక్తి కలవారు వచ్చి ఈ వేలంపాటలో పాల్గొని విజయవంతం చెయ్యగలరు అని కోరారు. పూర్తి వివరాలకుసెల్: 9676609844ని సంప్రదించాలన్నారు