రాజువయ్య మహారాజువయ్య
సీనియర్ పాత్రికేయుడు యతి రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి
సంతాపం వ్యక్తం చేసిన పలువురు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 23….. పత్రికా రంగంలో ఎందరికో మార్గదర్శకంగా నిలిచి పలువురు మన్నలను పొందిన ప్రముఖ పాత్రికేయుడు అందరికీ సుపరిచితుడు ఏబీఎన్ రాజ్ కుమార్ సోమవారం ఉదయం గుండెపోటుతో అకాల మరణం పొందారు. అతని మరణ వార్త విని హుటాహుటిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన భౌతిక ఆయన సందర్శించి టి యు డబ్ల్యూ జే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్, మొహమ్మద్ షఫీ ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు. మృతి చెందిన రాజ్ కుమార్ భౌతికాయాన్ని ఆయన స్వగృహమైన జూలూరుపాడు మండలం, గుండెపుడి గ్రామానికి ఆయన కుటుంబ సభ్యులు తరలించారు. గుండెపుడి వద్ద రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వేలాదిమందిగా తరలివచ్చారు. కొత్తగూడానికి చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరూ శోకసముద్రంలో మునిగిపోయారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరుగాంచిన రాజ్ కుమార్ గుండెపోటుతో అకాల మరణం పొందడాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొత్తగూడెం నియోజకవర్గం తో పాటు పరిసర ప్రాంత ప్రజలందరూ తండోపతండాలుగా గుండెపుడికి చేరుకొని రాజ్ కుమార్ కు ఘన నివాళులర్పించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియాలో తనదైన ముద్ర చేసుకుని సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన రాజకుమార్ మీడియా రంగంలో లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కన్నీరు మున్నీరయ్యారు. నివాళులర్పించిన వారిలో టి యు డబ్ల్యూ జె (ఐ జే యు) యూనియన్ జిల్లా అధ్యక్షులు ఇమంధి ఉదయ్ కుమార్, సీనియర్ పాత్రికేయులు, పోలీస్ యంత్రాంగం, వివిధ పార్టీలకు చెందిన నేతలు పలువురు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
