మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి25 : అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి….అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన మాలోత్ శ్యామ్ కుమార్, రూపా దంపతులకు ఒక కుమార్తె- లాస్య, కుమారుడు సోనూ ఉన్నారు. వీరు కూలీ పనులు చేసుకొని కిరాయి ఇంట్లో ఉంటున్నారు. గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య తరచూ మధ్యం త్రాగిన విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సైతం భార్యభర్తలు గొడవ పడగా, ప్రక్కన గల గ్రామస్తులు ఇరువురిని మందలించారు. భర్త కొడతాడనే భయంతో భార్య తన పిల్లలను వెంటబెట్టుకొని బయటకు వెళ్లింది. తిరిగి సోమవారం తెల్లవారుఝామును ఇంటికి రాగా అపస్మారక స్థితిలో ఉన్న భర్త శ్యామ్ కుమార్ ని చూసి, 108కి పోన్ చేసి, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. ఈ క్రమంలో ఆసుపత్రికి వెళ్లేలోపే భర్త చనిపోయాడని భార్య రూపా తెలిపింది. వీరిది ప్రేమ వివాహమని నా కుమారుడు మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని తండ్రి మాలోత్ బాలు
పోలీసులకు పిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు ఏఎస్సై క్రిష్ణరావు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.