విద్య వైద్యం ఉపాధి రంగాలకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంలో ముందున్నాం
అభివృద్ధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం
74 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్, ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 26.. జిల్లాలను అభివృద్ధి పరచటంలో తెలంగాణ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ముందున్నదని విద్య వైద్యం ఉపాధి రంగాలకు పెద్దపీట వేయడమే కాకుండా ప్రజలకు సంక్షేమ పలలు అందించడంలో అధికారులు సమన్వయంగా పనిచేస్తూ ఎంతో కృషి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ అనుదీప్, ప్రభుత్వ విప్ రేగాకాంతారావు స్పష్టం చేశారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నూతన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వేడుకల చింత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు అమరులు అయ్యారని వారి త్యాగఫలమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం అని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పొందుపరిచిన అనేక అంశాలు నేడు సమాజంలో అన్ని వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం ఉపయోగపడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు జిల్లా ప్రజల సంక్షేమం కోసం దోహదపడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఆలోచనతో ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలకు సద్వినియోగం పడుతున్నాయని అన్నారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు, లాంటివి అనేక పథకాలు నేడు రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు చేరవేయడంలో అన్ని శాఖల అధికారులు చేస్తున్న సంపూర్ణ కృషి ఎంతో అమోఘం అని అన్నారు. అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు.
