మన్యం న్యూస్, దమ్మపేట, జనవరి 26.. దమ్మపేట మండలం కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహం ఆవరణలో ఏర్పటు చేసిన 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం గురువారం భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులు అర్పించిన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి 74 వ గణతంత్ర దినోత్సవం పురష్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండలం కన్వీనర్ నిట్టా రామకృష్ణ, యేసుపాదం, గంటా వెంకటేశ్వరరావు, చారు గళ్ళ ప్రదీప్. ఎలికే నరసింహారావు, బెరవెల్లి ప్రసాద్, చేపా జోగారావు, సత్యం వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.