మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 26….. వందేమాతరం మనదే ఈతరం… దేశం మనదే త్యాగం మనదే ఎగురుతున్న జెండా మనదే అంటూ 24వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పరిష్కరించుకొని గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ప్రకాశం స్టేడియంలో వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్యాలు దేశభక్తిని చాటుకున్నాయి. జాతీయ భవన్ పెంపొందిస్తూ భిన్నత్వంలో ఏకత్వమైన మన భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు విద్యార్థులు వివిధ దేశభక్తుల వేషధారణతో వేసిన నృత్య రూపకాలు గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నె తెచ్చాయి
