మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 02: స్థానిక మండల కేంద్రంలోని పంచాయతీ పరిధిలో గల దుద్దుకూరి పద్మావతి మరణించిన విషయం తెలిసి గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వారి నివాసానికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనతో పాటు బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న , మాజీ జెడ్పిటిసి భూపాల నరసింహారావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాదిక్ పాషా, వార్డ్ నెంబర్ సౌకత్ అలీ, తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు.