మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 02.. మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను గురువారం మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత సందర్శించారు.
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా బూర్గంపహాడ్ లో గల కస్తూరిబా పాఠశాల ని సందర్శించి అక్కడ పిల్లలు ముచ్చటించి భోజనం, వసతి, చదువు, వివరాలు అడిగి తెలుసుకున్నారు, అలాగే అక్కడ ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు, సమస్యల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తామని చెప్పారు, ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి భూపాల నరసింహారావు, మైనార్టీ సెల్ అధ్యక్షులు సాదిక్ పాషా, వార్డ్ నెంబర్ సౌకత్ అలీ తదితరు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
