మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఫిబ్రవరి 2: మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ సత్సంగ ప్రార్థన మందిరంలో 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హాజరయ్యారు.అనంతరం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకరరావు,జెడ్పీటీసీ భారత లావణ్య రామ్,సర్పంచ్ బోడా పద్మ,శ్రీ బాలాజీ సత్సంగ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.