UPDATES  

 ఏడూళ్ళ బయ్యారం సాయిబాబా గుడి దేవాలయ ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా ముక్కు నర్సారెడ్డి

ఘనంగా సన్మానించిన రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాసరెడ్డి, మండల బి.ఆర్.ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు
మన్యం న్యూస్,పినపాక:
మండలంలోని ఏడూళ్ళ బయ్యారం సాయిబాబా గుడి దేవాలయ ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా ముక్కు నర్సారెడ్డి గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారిని పినపాక మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాసరెడ్డి, బి.ఆర్.ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి లు ఘనంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఆలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !