మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి03: పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, సమత్ భట్టుపల్లి సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి శుక్రవారం మణుగూరు మండలంలో పర్యటించారు. పలు కుటుంబాలను పరామర్శించి మనోధర్యం నింపి బియ్యం, నగదు ఆర్థిక సాయం చేశారు.ఈ కార్యక్రమంలో పూనెం మోహన్, మన్నె శ్రీనివాస్, కూకల రాములు, కొత్తపల్లి సత్యనారాయణ, కన్నెబోయిన లాలు, కొమరం మోహన్, గుండ్ల రమేష్, రమణ, శ్రీను, భద్రం, పినపాక, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
