UPDATES  

 తెలుగు సినిమా గొప్పదనాన్ని చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి కె విశ్వనాథ్.. తెలుగు నాటక సంఘం జిల్లా కార్యదర్శి దామోదర్ రావు

మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 03..
కళాతపస్వి తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటిన కె విశ్వనాథ్ మృతి సినిమా రంగానికి తీరనిలోటని జిల్లా తెలంగాణ నాటక సంఘ సంయుక్త కార్యదర్శి కొమరం దామోదరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కె విశ్వనాథ్ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం మాట్లాడారు. భారతీయ సాంప్రదాయ సంస్కృతి ప్రతిభవించే సినిమాలు తీసి నేటితరం యువతకు మన సాంప్రదాయ విలువల గొప్పదనాన్ని నేర్పించి పాటించే విధంగా తీర్చిదిద్దిన దర్శకులు విశ్వనాధ్ మరణం సినీ లోకానికే కాక భారతీయుల అందరికి తీరని లోటని అటువంటి దర్శక ధీరుడు నటుడు లేని లోటు పూడ్చలేదని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరారు. మండల కేంద్రంలోని లక్ష్మీ నగరం గ్రామంలో బస్టాండ్ సెంటర్ వద్ద కే విశ్వనాథ్ చిత్రపటానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిలక వెంకట్ రమణ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పిలక నాగేందర్ రెడ్డి, ముక్కెర రాంబాబు, ప్రభాకర్, ఆకుల రామారావు, గోసంగి కిరణ్, సుధాకర్, శివ కుమార్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !