UPDATES  

 యువత క్రీడల్లో రాణించాలి.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని స్నేహబంధాన్ని పెంపొందిస్తాయి.. సీఐ రమేష్

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 03..
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని స్నేహబంధాన్ని పెంపొందిస్తాయని యువత క్రీడల్లో రాణించాలని దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గౌరారం గ్రామంలో రెండు మండల స్థాయి క్రికెట్ పోటీలను ఎంపీపీ రేసు లక్ష్మి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చతిస్గడ్ పరిధిలోని మారుమూల ఏజెన్సీ గ్రామంలో క్రీడా పోటీలో నిర్వహించడం గొప్ప విషయమని క్రికెట్ పోటీలో పాల్గొనే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని కోరారు. మండలంలోని యువత క్రీడాలతో పాటు చదువులో  కూడా రానించాలని అన్నారు. క్రికెట్ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి దుమ్ముగూడెం పోలీస్ శాఖ తరపున మ్యాన్ ఆఫ్ ది సిరీస్  నగదు బహుమతిని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సోడి జ్యోతి ఎస్సై రవికుమార్ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి కనితి  రాముడు, లక్ష్మణ్ పంచాయతీ కార్యదర్శి ఉపాధ్యాయుడు రేసు శ్రీను, ఆర్గనైజర్ కమిటీ సురేష్, నాగార్జున గ్రామస్తులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !