మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి04: ఎవ్వరైనా సరే ఫుట్ పాత్ ను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మణుగూరు మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ అన్నారు. ఆయన శనివారం పట్టణ ప్రాంతంలోని ప్రధాన రహదారి కి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫుట్ పాత్ దాటి ఎవ్వరు దుకాణాలు ఏర్పాటు చేయవద్దన్నారు. అలా చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాలను ఆక్రమిస్తూ వెలసిన చిరుదుకాణాల నుంచి సదరు దుకాణదారులు, యజమానులు సుమారు 5000 రూపాయల చొప్పున అద్దెలు తీసుకోవడం దారుణమని, వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
