పెద్ద ఎత్తున రైతులకు రుణమాఫీ అయింది
త్వరలోనే గుండాల బ్యాంకుకు నూతన భవనం మంజూరు చేస్తా
జిల్లా డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం
మన్యం న్యూస్ గుండాల ఫిబ్రవరి 04: జిల్లా సహకార బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగిందని జిల్లా డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. శనివారం తొలిసారిగా మండలంల కేంద్రంలోని డిసిసిబి బ్యాంకు తో పాటు సొసైటీని ఆయన సందర్శించారు. అనంతరం జిల్లా చైర్మన్ నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద మొదటి దపా రూ.25 కోట్లు రెండవ దపా రూ. 63 కోట్లు రుణమాఫీ కింద అయినట్టు ఆయన పేర్కొన్నారు. డిసిసి బ్యాంకులో రుణాలు తీసుకున్న వారు సకాలంలో ఏడు శాతం రుణం చెల్లిస్తే వారికి మూడు శాతం రివర్స్ వస్తుందని ఆయన తెలిపారు. డిసిసి బ్యాంకులో పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులకు ప్రతి ఎకరానికి లక్ష రూపాయల చొప్పున విద్య కోసం, ఇటుకల బట్టీలు, రైస్ మిల్లులు, పిండి మిల్లులు, కారం మిల్లులు, కోళ్ల ఫారం కోసం రుణాలను మంజూరు చేస్తామన్నారు. ఇట్టి రుణాలపై 35 శాతం సబ్సిడీ వర్తిస్తుందని ఆయన అన్నారు. త్వరలోనే గుండాల మండల కేంద్రంలో డిసిసి బ్యాంక్ కోసం 50 లక్షల రూపాయల నిధులను విడుదల చేసి భవనాన్ని త్వరగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ రూపంలో వేయి 28 కోట్లు జమ అయినట్లు పేర్కొన్నారు. డిసిసి బ్యాంకు నుండి గోల్డ్ లోన్ కోసం 1680 కోట్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కుమ్మరి జిల్లాలో 100 సొసైటీలు ఉండగా 50 సొసైటీలకు నూతన గోదాముల కోసం 28 కోట్లను నాబార్డు నిధి కింద మంజూరు చేయించినట్లు ఆయన అన్నారు. స్థానిక చైర్మన్ లకు సైతం గ్రేడ్ల వారిగా గౌరవ వేతనం వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని బ్యాంకులు సొసైటీలను ప్రగతి పదములు నిలుపుతానని ఆయన పేర్కొన్నారు. అనంతరం డిసిసి బ్యాంక్ నిర్మాణం కోసం ఉన్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ రామయ్య, ఇల్లందు టిసిసిబి డైరెక్టర్ జనగాం కోటేశ్వరరావు, డిసిసిబి మేనేజర్ నామ నాగరాజు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసం పాపారావు డిసిసిబి సిబ్బంది పాల్గొన్నారు
