మన్యం న్యూస్, దమ్మపేట, ఫిబ్రవరి 4: దమ్మపేట మండలం చిల్లగుంపు గ్రామంలో నూతనంగా నిర్మించినా కోదండరామాలయంలో సీతారామాంజనేయ, ముత్యాలమ్మ, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం పాల్గొన్నారు. వారినీ ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. తదుపరి అలయ కమిటీ సభ్యులుతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గోని శ్రీకోదండరామాలయం అభివృద్ధికి తన వంతు గా 10116/- రూపాయిలు అలయ కమిటీ సభ్యులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో అలయ కమిటీ సభ్యులు కేసెట్టి సతీష్కుమార్, ధనంజయ్ రావు, కేసెట్టి నాగరాజు, శ్రీనివాసరావు, కొయ్యల అచ్చుతరావు, సూర్యకుమార్, గ్రామస్థులు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.