మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 04
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. తెలంగాణ ప్రజల పాలిట పెన్నిధిగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేశారు. శనివారం సీతంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులు , అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు . అలాగే పార్టీ నాయకులు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలని, గ్రామస్థాయిలో ఉన్న వివిధ సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో సీతంపేట ఉప్పాక సర్పంచులు పోతినేని శివ శంకర్, సుజాత, ఉప సర్పంచ్ కొండేరు నాగభూషణం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార నరసింహారావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.