UPDATES  

 అశ్వరావుపేట నియోజకవర్గంలో పొంగులేటి ఎంఎల్ఎ అభ్యర్థిగా జారే ఆదినారాయణ – ప్రకటించిన మాజీ ఎంపీ పొంగులేటి

 

మన్యం న్యూస్, అశ్వారావుపేట, పిబ్రవరి 06.. అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా జారే ఆదినారాయణను నియమిస్తానని మాజీ ఎంపీ పొంగులేటి అన్నారు. ఏ జెండా అని కాదు మనకి నచ్చిన నాయకుని ఎన్నుకునే అజెండ ముఖ్యమని ఆయన తెలిపారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరో సారి అధికార పార్టీపై నేరుగా విమర్శలు సంధించారు. అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, నెమలి పేట గ్రామంలో సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు పొంగులేటి. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రెండోసారి అధికారం చేపట్టిన ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఇచ్చిన హామీలపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఒక్క పేదవాడికి కూడా ఎకరం భూమి ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ఒక్కొక్క గ్రామంలో పదో పదిహేను డబుల్ బెడ్ రూములు ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నారు తప్ప అందరికీ న్యాయం జరగట్లేదు అని అన్నారు. పోడు పట్టాలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇప్పటికీ అమలు చేయటం లేదని అన్నారు. సర్పంచులు గ్రామపంచాయతీ అభివృద్ధికి సొంత డబ్బులు వెచ్చించి ఉన్న బిల్లులు ఇప్పటికీ విడుదల చేయకుండా కొత్తగా మరల 10 లక్షల ఇస్తాను 20 లక్షలు ఇస్తాను అంటూ హామీలు చేస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ తనని అభిమానించే కొంతమంది నాయకుల్ని సస్పెండ్ చేస్తున్నారని, నిజంగా మీరు సస్పెండ్ చేయాలనుకుంటే తనని సస్పెండ్ చేయాలని సవాల్ విసిరుతున్నట్లు అన్నారు. ముఖ్యమంత్రి అంటే దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి లాగా ఉండాలని అన్నారు. పార్టీలు మారే విషయంలో వస్తున్న ఉదాంతాలు వాస్తవం కాదని తానిప్పుడు పార్టీ మారాలో తానే డిసైడ్ చేసుకుంటానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. పొంగులేటిని అభిమానించే నాయకుని, కార్యకర్తను అధికారిని, ఏ ఇతర అధికారి ఇబ్బంది చేయవద్దని అధికారం ఎవడబ్బ సొత్తు కాదు. 2023 లో తాను పెట్టే అభ్యర్థులంతా విజయం సాధించి తీరుతారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, అశ్వరావుపేట నియోజకవర్గం నాయకులు జారే ఆదినారాయణ, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్, సర్పంచులు అట్టం రమ్య, యాట్ల నాగలక్ష్మి, మడకం సుశీల, కొమరం బాబురావు, అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !