UPDATES  

 ప్రజావాణిలో ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం కావాలి జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06…ప్రజావాణిలో వచ్చిన పిర్యాదులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో సమస్య పరిష్కరించాలని ప్రజలు చేసిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. రానున్న ప్రజావాణిలో పరిష్కారానికి చేపట్టిన చర్యలపై
సమీక్షించనున్నట్లు ఆయన వివరించారు. ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన మత్స్యశాఖ అధికారికి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిఆర్జేకు సూచించారు.

ప్రజావాణిలో సమస్య పరిష్కరించాలని చేసిన దరఖాస్తులు కొన్నిమంజూరు
పాల్వంచ మండలం, జగన్నాథపురం గ్రామ కాపురస్తులు డి లక్ష్మణ్ మరికొందరు ట్రైకార్
కొరకు దరఖాస్తు చేసుకున్నామని, సంవత్సరం అయినప్పటికీ ఇంతవరకు రుణం మంజూరు కాలేదని, రుణం మంజూరు
చేపించు విధంగా చర్యలు చేపట్టాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం ఏపిఓ, ఐటిడిఏకు
ఎండార్స్ చేశారు.
కొత్తగూడెం మండలానికి చెందిన అడపాల మధుసూదన్ రావు, విజయలక్ష్మి, అమృతాదేవి, ఉమా సత్యవాణి,
సురేందర్ మేదరబస్తీ, గొల్లగూడెం రోడ్డులోని సర్వే నెం. 143, ఇంటి నెం.7-3-010003లో ఉన్న 100 గజాల ఇంటి స్థలం తమ తల్లి అడపాల రాఘవమ్మ పేరున ఉందని, వారసులకు తెలియకుండా మాలో ఒకరైన అడపాల వెంకటరమణారావు
తన పేరున పట్టా చేపించుకున్నారని, అట్టి ఇంటిస్థలం వారసులందరికీ చెందే విధంగా చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎండార్స్ చేశారు.
చండ్రుగొండ మండలానికి చెందిన ఎస్కే భాషమ్మ భర్త లేటు షర్ఫుద్దీన్ సర్వే నెం.10లో తన కుమారుడు ఎస్కే సైదులు (లేటు) పేరుతో వారసత్వంగా లభించిన ఇంటిస్థలమును ఇతరులు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని,
తనను భూమిలోకి రానివ్వకుండా అడ్డు పడుతున్నారని పేర్కొంటూ సర్వే చేపించి, హద్దులు నిర్ణయించి అప్పగించాల్సిందిగా
చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం తహసిల్దార్కు ఎండార్స్ చేశారు.
దమ్మపేట మండలం, మారెప్పగూడెం పంచాయతీ, కొత్తూరుకాలనీకి చెందిన బండిబోయిన సుబ్బారావు,
కోయకులమునకు చెందినవాడనని, తాను 2002 సంవత్సరం నుండి పోడు వ్యవసాయం చేస్తున్నానని, ఈ మద్యకాలంలో అటవీ అధికారులు తనను భూమిపైకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, తాను పోడు పట్టాకొరకు కూడా దరఖాస్తు
చేసియున్నానని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం కలెక్టరేట్ ఈ సెక్షన్ అధికారికి ఎండార్స్
చేశారు. బూర్గంపాడు మండలానికి చెందిన గోదావరి వరద ముంపు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని, వరద ముంపు నుండి రక్షణకు గాను అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో రెండు పడకల ఇండ్లు కానీ ఇంటిస్థం కానీ
మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ విచారణ నిర్వహించి నివేదిక అందచేయాల్సిందిగా ఎండార్స్ చేశారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులుపాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !