మన్యం న్యూస్ కరకగూడెం: మిషన్ భగీరథ లో పనిచేస్తున్న కార్మికులు తమయొక్క సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడానికి సిఐటియు మండల కమిటీ నిరసిస్తుంది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కొమరం కాంతారావు మాట్లాడారు మిషన్ భగీరథ లో జీవో నెంబర్ 11 ప్రకారం జీతాలు చెల్లించాలని, ప్రస్తుతం ఇస్తున్న జీతాలు కూడా సక్రమంగా అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని అనేకమార్లు విన్నవించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వీరికి పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కూడా లేవని జీతాలు సక్రమంగా చెల్లించడంలో తీవ్ర జాప్యం నెలకొంటుందని కనీస వేతనం అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర సమస్యలప సిఐటియు ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేందుకే అక్రమంగా అరెస్టు చేశారని వారు దుయ్యబట్టారు. రానున్న కాలంలో తమ యొక్క సమస్యలు పరిష్కారం కొరకు మరిన్ని ఆందోళన పోరాటాలకు సిద్ధపడాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు .
