మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 07 మండల కేంద్రంలోని కృష్ణ సాగర్ అటవీ ప్రాంతంలో గోదావరి నది వరద బాధితులకు మొరంపల్లి బంజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ స్పందన, డాక్టర్ గొంది వెంకటేశ్వర్ల సంయుక్తంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. గోదావరి నది వలస ప్రాంత గ్రామంలో ఒకే ఇంటిలో ముగ్గురికి మలేరియా పాజిటివ్ కేసులు ఉన్నాయని వారికి మలేరియా శాఖ ఆధ్వర్యంలో మాత్రలు అందించడం జరిగిందని. అదేవిధంగా మలేరియా డెంగు పారిశుధ్యం పై అవగాహన కల్పించడం జరిగిందని డాక్టర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
