మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 08…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో, ఆర్టీసీ కళాకారులు తెలంగాణ ఆర్టీసీ గొప్పతనాన్ని తెలుపుతూ, కళాజాత కార్యక్రమం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డు లో బుధవారం నిర్వహించారు. 90 సంవత్సరాలుగా నిరంతరాయ సేవలను అందిస్తూ సుదూర ప్రాంత ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేరుస్తూ, ఒక సుస్థిర స్థానాన్ని పొందిందని కళాకారులు గేయాల రూపంలో వీక్షకులకు వినిపించారు. 90 ఏళ్లుగా ప్రజానీకానికి ఆర్టీసీ సేవలందిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ ఆర్ టి సి కి చెందిన కళాకారులు పాల్గొన్నారు.
