UPDATES  

 దేశ అభివృద్ధి లో యువత ప్రధాన పాత్ర పోషించాలి* క్రీడల ద్వారా ఆరోగ్యం, మానసిక ఉల్లాసం

మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 08..
మంగపేట మండలం జబ్బోనిగూడెం గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్టును బుధవారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు,మాజీ ఎంపీపీ,సర్పంచ్ కుడుముల లక్ష్మీనారాయణ. అందజేశారు
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యువత చదువులోనే కాకుండా క్రీడ రంగంలోనూ ముందుకు దూసుకెళుతూ దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదగాలనివారు అన్నారు.క్రీడలు ఆడడం వలన శరీరం దృఢత్వంగా మారుతుంది. దానితోపాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు అని అన్నారు . అదేవిదంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ..యువతను క్రీడారంగం దిశగా ఆసక్తి ఉన్న యువకులను ప్రోత్సహిస్తూ బి ఆర్ ఎస్ నాయకులు చేస్తున్న, సహాయం సహకారం చాలా గొప్పదని యువతకు అంతర్జాతీయ స్థాయి వరకు వెల్లగలిగేంత టాలెంట్ ఉన్న క్రీడాకారులు మన జిల్లాలో చాలామంది ఉన్నారని వారికి కూడా ఇలాంటి సహాయం సహకారాలు అందించాలని ఇలాంటి నాయకులే నేటి యువతకి చాలా అవసరమని వారు అన్నారు. అనంతరం యువత ఘనంగా మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ను శాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్, అచ్చ సత్యనారాయణ,మండల నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య,కటికనేని సత్యనారాయణ మండల ఆర్గనైజేషన్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి , బుచ్చంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటమల్లు,ఉప్పలయ్య మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, శేఖర్ ,వెంకన్న, కోరం కిషోర్, వంశీ రాజేష్, కృష్ణకుమార్ పెద్దిలింగయ్య, గోవర్ధన్ ,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !