UPDATES  

 ప్రజల కోరిన సంవత్సరందించడంలోనే సమాచార హక్కు చట్టం బాధ్యత. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ గుగులోత్ శంకర్ నాయక్

ప్రజల కోరిన సంవత్సరందించడంలోనే సమాచార హక్కు చట్టం బాధ్యత.
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ గుగులోత్ శంకర్ నాయక్
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08….సమాచార హక్కుచట్టం ద్వారా ప్రజలు కోరిన సమాచారాన్ని సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజులలో అందించాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్ తెలిపారు. బుధవారం ఆర్డిఓ కార్యాలయపు సమావేశపు హాలులో సమాచారహక్కుచట్టంపై వచ్చిన 25 ఫిర్యాదులపై పౌర సమాచార అధికారులతో విచారణ నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులు, పౌర సమాచార అధికారులతో సమాచారహక్కు చట్టం విధులు, పరిధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారితనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. సకాలంలో సమాచారం ఇవ్వని కారణంగా ప్రజలు నేరుగా కమిషన్ ను సంప్రదిస్తున్నారని చెప్పారు. ప్రజలు, ఆయా శాఖల పౌర సమాచార అధికారులతో కేసులను విచారణ ప్రక్రియ నిర్వహించి కోరిన సమాచారాన్ని అందచేసినట్లు చెప్పారు. సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం రాకపోత దరఖాస్తు దారులు మొదటి అప్పిలేట్ ఆధారిటికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మొదటి అప్పిలేట్ అథారిటీ విచారణ చేపట్టి సమాచారం ఇప్పించడంతో పాటు సమస్య పరిష్కరానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అప్పిలేట్ అథారిటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టని పక్షంలో సెక్షన్ 19 (3) ప్రకారం సమాచార హక్కు చట్టం కమిషన్ కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. జాప్యాన్ని తొలగించేందుకు ప్రజల్లో చైతన్యం నింపేందుకు, 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం ఇప్పించు విధంగా కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజా ప్రయోజనాలు, శ్రేయస్సుకోసం కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారాన్ని అందించాలని పౌర సమాచార అధికారులను ఆదేశించారు. పౌర సమాచార అధికారులు సెక్షన్ 4(1) బి ప్రకారం 17 అంశాలతో కూడిన సమాచారాన్ని కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని చెప్పారు. సెక్షన్ 4(1) బి నిర్వహణ వల్ల కార్యాలయ విధులు నిర్వహణ, కార్యాలయ సమగ్ర సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. సెక్షన్ 5 (1) 5(2) ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం2005 ప్రకారం పౌర సమాచార అధికారి, మొదటి అప్పిలేట్ అథారిటీ, వారి పేర్లు, ఫోన్ నెంబర్లు వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. సెక్షన్ 4 (1) బి తప్పనిసరిగా అలాగే ప్రతి పౌర సమాచార అధికారి సమాచార హక్కు చట్టం 2005 సమాచార రిజిస్టర్ 16 కాలాల కూడిన అలాగే 8 కాలాలతో కూడిన రిజిస్టర్ పకడ్బందీగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. పౌరులకు సమాచారం అందచేయడంలో రాష్ట్ర కమిషన్ సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు. కమిషన్ కు వచ్చిన దరఖాస్తులను మూడు నెలలు నుంచి ఆరు నెలల లోపు కేసు విచారణ చేపట్టి సమాచారం ఇప్పియడంలో విజయవంతంగా ముందుకు వెళ్తునట్లు చెప్పారు. రాష్ట్ర సమాచార కమిషన్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా సేవలందిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే పౌర సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వీలుగా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రస్థాయిలో కమిషన్ వేలాది కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. సమాచార హక్కుచట్టంపై ప్రజలకు, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, అటవీ, విద్యాశాఖలకు సంబంధించి ఎక్కువ వస్తున్నాయని ఆయన వివరించారు. చైతన్యవంతులు మాత్రమే చట్టాన్ని వినియోగించు
కుంటున్నారని, తెలియనివాళ్లు చాలా మంది ఉన్నారని అటువంటి వారందరూ కమిషన్ విధులు తెలియచేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లాలో సమాచారహక్కు చట్టం పరిధి, విధులపై జిల్లా అధికారులకు, పౌర సమాచార అధికారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తుదారులు అడిగిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వక పోవడం వల్ల, సమస్య జటిలం అవుతుందని చెప్పారు. ప్రజలును ఇబ్బంది పెట్టకుండా కోరిన సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఏదైనా సమాచారం కొరకు ప్రజలు నేరుగా తన ఫోన్ నెంబర్ 9908817986కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని లబ్ధి పొందుతున్న సంస్థలు స్వచ్ఛందంగా పౌరులు అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, పౌర సమాచార అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !