మన్యం న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 08…, మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో సమ్మక్క సారలమ్మ తల్లుల మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. ఈ జాతర బుధవారం ఆదివాసి గిరిజన పూజారుల ఆచార సంప్రదాయాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ తల్లి ప్రధాన పూజారి కట్రం నరసింహారావు మాట్లాడుతూ.. ఈ రెండు రోజులు ఆదివాసి గిరిజన ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, బుధవారం రాత్రి తల్లులకు సేవ చేస్తూ జాగారం ఉంటుందని తెలిపారు. గురువారం సాయంత్రం తో జాతర ముగుస్తుందని, కావున పరిసర ప్రాంత భక్తులందరూ మొక్కులు చెల్లించుకోవచ్చునని తెలిపారు.