మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి 08 …
మండల పరిధిలోని రావికంపాడు గ్రామంలో ఉచిత పశువైద్యశిబిరాన్ని పంచాయతీ సర్పంచ్ బానోత్ రణ్య బుధవారం ప్రారంభించారు.పశువుల్లో వచ్చే గర్భకోశ వ్యాధికి వెటర్నరీ డాక్టర్ రాంప్రసాద్ వైద్యం చేశారు.ఈ సందర్భంగా ఆయన రైతులకు అవగాహన కల్పించారు. దూడలల్లో నట్టల నివారణ చేపట్టాలన్నారు. నట్టల వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుందని, తద్వారా రైతులు ఆర్ధికంగా నష్టపోవడం జరుగుతుందన్నారు. ఉచిత వైద్యశిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, గోపాలమిత్రలు సాయి ప్రకాశ్, వెంకటదాసు, నరేష్, శ్రీఉ, రాము, ప్రసాద్, సురేష్, సుధీర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.