UPDATES  

 కొమరారంను మండల కేంద్రంగా ప్రకటించాలి.

 

మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి09:- ఇల్లందు మండల మేజర్ పంచాయితీ కొమరారం ను మండలంగా ప్రకటించాలని కోరుతూ గత తొమ్మిది రోజులుగా రిలే నిరాహారదీక్ష చేపడుతున్నారు గురువారం రోజు దీక్షా శిబిరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య సందర్శించి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కొమరారాన్ని మండలంగా ప్రకటించాలని  గత ఎనిదెళ్లుగా పోరాటం సాగిస్తున్నారని, తాను ఎమ్మెల్యే గా ఉన్నటువంటి సమయంలో కూడా 2015 సంవత్సరం సెప్టెంబర్ 21న  అప్పటి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ కి సైతం వినతి పత్రం అందజేయటం జరిగిందని సందర్భంగా గుర్తుచేశారు. కార్యక్రమంలో (ఎంఎల్)పార్టీ నేతలు రాజు, సావిత్రి,బిచ్చా, రాము  తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !