UPDATES  

 కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన ఎంపీపీ

మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 09..
తెలంగాణ ప్రభుత్వం కంటి వ్యాధితో బాధపడుతున్న వారికి కంటి వెలుగు అనే కార్యక్రమం ద్వారా పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుందని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. గురువారం ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని కిష్టాపురం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంటి వ్యాధితో బాధపడే వారికోసం కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైందని, ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని, కంటి చూపులు పొందాలని అన్నారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుతారి సుశీల, ఎంపీటీసీ కాయం శేఖర్, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు శృతి, కంటి వైద్య నిపుణులు ప్రసన్న, ఉప సర్పంచ్ మొగిలిపల్లి రమాదేవి, గ్రామస్తులు ఉండం బాబురావు, నాగరాజు, పూనెం నరసింహారావు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !