మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 09..
తెలంగాణ ప్రభుత్వం కంటి వ్యాధితో బాధపడుతున్న వారికి కంటి వెలుగు అనే కార్యక్రమం ద్వారా పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుందని ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. గురువారం ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని కిష్టాపురం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంటి వ్యాధితో బాధపడే వారికోసం కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైందని, ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని, కంటి చూపులు పొందాలని అన్నారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుతారి సుశీల, ఎంపీటీసీ కాయం శేఖర్, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు శృతి, కంటి వైద్య నిపుణులు ప్రసన్న, ఉప సర్పంచ్ మొగిలిపల్లి రమాదేవి, గ్రామస్తులు ఉండం బాబురావు, నాగరాజు, పూనెం నరసింహారావు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
