UPDATES  

 విద్యుత్ సంస్థల దోపిడీపై ప్రజలు పోరాడండి సిపిఐ ఎంఎల్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖ విడుదల

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 09..విద్యుత్ సంస్థల దోపిడీపై ప్రజలు పోరాడాలని ఏసీడీ చార్జీల పేరుతో చేస్తున్న దోపిడీని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ పేరిట గురువారం లేఖ విడుదలైంది. లేఖలో పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే
ఎప్పుడొస్తుందో తెలియని కరెంటు కోసం రైతులు మోటార్ల దగ్గరే పడిగాపులు పడుతున్నారని
వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఎటుపోయింది..? ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయా. ప్రభుత్వం విద్యుత్ సంస్థలను
నడిపింస్తుందో అర్థం కాని పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. నిజానికి ఒక్క విద్యుత్ రంగమే కాదు ఏ ప్రభుత్వ రంగ సంస్థలను చూసినా ఇదే పరిస్థితి నెలకొందని ఆరోపించారు . ప్రభుత్వం ప్రజలకు చేయూతనిచ్చే భాధ్యతనుంచి పూర్తిగా
తప్పుకొని ప్రజలపై భారం వేసి పాలన సాగించే కొత్త ఒరవడిలో పాలన సాగుతోందని అన్నారు.. ఒక పక్క బహుల కంపెనీలు, విదేశీ సంస్థలు, స్వదేశీ పెట్టుబడి దళారీ సంస్థలకు పెద్ద ఎత్తున రాయితీఇస్తూ వారి
పిల్లరీలను మోసే బాధ్యతలను ప్రభుత్వాలు నిస్పిస్తుగా అమలుచేస్తున్నాయి అన్నారు. అసలు సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేనేలేదని.నిత్యం ప్రజలపై ఏదో ఒక రూపంలో పన్నులు, టాక్స్ లు బలవంతంగా ప్రభుత్వాలు వసూలు చేస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాల ఎంగిలి మెతుకులు గ వేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు పేదలను బ్రమల్లో ఉంచి నిత్యం పేదలపై కానరాని భారం మోపి సామాన్యుడి నడ్డివిరుస్తున్నారని అన్నారు.. పైగా
తమది సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని. పేదల బతుకు అమ్మబోతే
అడవి కొనబోతే కొరిని అన్నట్లు తయారైందన్నారు…
ఇప్పటికీ విద్యుత్ చార్జీల మూలంగా సామాన్యుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని. రకరకాల అర్థాల పేరుతో స్థాయిల పేరుతో యూనిట్ రేట్లు పెంచి దోపిడీ చేస్తున్న విద్యుత్ సంస్థలు కొత్తగా అడిషనల్
కెప్టెన్ డిపాజిట్”(డి) ప్రజల దగ్గరి నుంచి వసూల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన
తర్వాత ఎన్నడూ లేనంత రికార్డ్ స్థాయిలో ఇటీవల కాలంలో విద్యుత్ చార్జీలు పెంచారని, గృహ
వినియోగదారులకు యూనిట్ 30 పైసలు గృహేతర వినియోగదారులకు యూనిట్ రూపాయి
అదనంగా ప్రజల దగ్గరనుంచి వసూల్ చేస్తున్నారని అన్నారు.. సంక్షేమం పేరుతో ప్రభుత్వాలు అప్పులు చేయడం ప్రజలపై భారం వేయడం చాలా దుర్మార్ధిక విద్యుత్ సంస్థలు కొత్తగా తీసుకు
వచ్చిన ఏసిడీ చారీలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తుందని లేఖలో పేర్కొన్నారు .

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !